ఎక్కడికి వెళ్లినా ప్రజలు వైసీపీని అసహ్యించుకుంటున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగిన టీడీపీ శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ రూ.11 లక్షల కోట్లు అప్పులు తెచ్చారని ఫైర్ అయ్యారు. నారా లోకేశ్ సహకారంతో టెక్కలిలో ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు ఇచ్చానని తెలిపారు. టెక్కలి నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రంగా మారుస్తానని హామీ ఇచ్చారు.