సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర 18వ రోజు ఎస్టీ రాజపురం ప్రాంతం నుంచి ప్రారంభమైంది. రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్ మీదుగా ఉందురు క్రాస్ చేరుకొని జగన్ భోజన విరామం తీసుకుంటారు. తరువాత సాయంత్రం 4:30 గంటలకు కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం పిఠాపురం, గొల్లప్రోలు, కత్తిపూడి, తుని, పాయకరావుపేట బైపాసుల మీదుగా గొడిచర్ల క్రాస్ వద్ద బస శిబిరానికి చేరుకుంటారు.