AP: గ్రూప్-2 ప్రధాన పరీక్ష(మెయిన్స్)ను మూడు నెలల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, హడావుడిగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారని తెలిపారు. కొందరు ఎన్నికల విధుల్లో పాల్గొనడం వల్ల పరీక్షలకు సన్నద్ధం కాలేకపోయారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వాయిదా వేయాలని కోరుతూ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.