గోపాలపురం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

55చూసినవారు
గోపాలపురం: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
బైకును ట్రాక్టర్ ఢీ కొట్టడంతో నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలానికి చెందిన జగదీష్ (40) అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య జయలక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేశామని సీఐ శ్రీనివాస్ గురువారం తెలిపారు. జగదీష్ భార్య జయలక్ష్మికి అనారోగ్యంగా ఉండటంతో బైక్‌పై నల్లజర్ల వచ్చి తిరిగి వెళుతుండగా పోలవరం కాలువ సమీపంలో ట్రాక్టర్ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని, దీనిపై విచారణ చేపట్టామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్