ఏపీలో ఎన్నికలకు చాలా తక్కువ సమయం ఉంది. దాంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో ధర్మవరం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్కు మద్దతుగా సినీ నటి నమిత ప్రచారం చేశారు. చౌడేశ్వరి ఆలయంలో అమ్మవారికి పూజలు చేసి ప్రచారం ప్రారంభించారు. గాంధీనగర్ సర్కిల్ వద్ద నమితను చూడటానికి పెద్ద సంఖ్యలో పట్టణ ప్రజలు వచ్చారు.