అయ్యప్ప స్వామి గుడిలో చోరీ.. దర్యాప్తు ముమ్మరం
తుళ్ళూరు అయ్యప్ప స్వామి గుడిలో మంగళవారం రాత్రి చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందుకు సంబంధించిన సీసీ పుటేజ్ను పరిశీలించారు. దుండగులు రాత్రి సమయంలో ప్రహరీ దూకి లోనికి ప్రవేశించి హుండీని దొంగిలించినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఒక వ్యక్తి గుడి లోపల చోరీ చేస్తుంటే. మరో వ్యక్తి బైక్పై రెక్కీ నిర్వహించాడు.