బావిలో పడి ఇంటర్ విద్యార్థి మృతి (వీడియో)

52చూసినవారు
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వేసవి సెలవులకు మేనత్త ఇంటికి వెళ్లిన పోతురాజు రాము (18).. గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు పంట పొలాలలోని నేల బావిలో పడి మృతి చెందాడు. స్థానికులు బావిలో నుంచి రాము మృతదేహాన్ని బయటకు తీశారు. రాము.. దేవరపల్లి మండలం బాలంపల్లికి చెందిన వాడు. అతను ఇంటర్మీడియట్ చదువుతున్నాడు.
Job Suitcase

Jobs near you