ప్రజల సమక్షంలోనీటి నమూనాల పరిశీలన

58చూసినవారు
ప్రజల సమక్షంలోనీటి నమూనాల పరిశీలన
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు కాకినాడ లో శనివారం సాయంత్రం పేర్రాజుపేట ప్రాంతంలో పర్యటించి నీటి నమూనాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో స్థానికులతో మాట్లాడి మంచినీటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా లోపాలు, సమస్యలు, ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. ప్రజల సమక్షంలోనే మంచినీటి నమూనాలను పరిశీలించి చూపించారు. ఆయన వెంట డిఈ బిహెచ్ సుబ్బారావు, ఏఈ వై. నాగేశ్వరరావు ఇతర సిబ్బంది ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్