కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు కాకినాడ లో శనివారం సాయంత్రం పేర్రాజుపేట ప్రాంతంలో పర్యటించి నీటి నమూనాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో స్థానికులతో మాట్లాడి మంచినీటి నాణ్యతను అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరా లోపాలు, సమస్యలు, ఏమైనా ఉన్నాయా? అని ఆరా తీశారు. ప్రజల సమక్షంలోనే మంచినీటి నమూనాలను పరిశీలించి చూపించారు. ఆయన వెంట డిఈ బిహెచ్ సుబ్బారావు, ఏఈ వై. నాగేశ్వరరావు ఇతర సిబ్బంది ఉన్నారు.