టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ ఎంపీ కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. గురువారం విజయవాడలో జరిగిన నాలుగో విడత వైఎస్సార్ ఆసరా సంబరాల్లో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ధనికుల పక్షపాతి అని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవటమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం నిర్మాణం అని చెప్పి శంకుస్థాపన కూడా చేయలేదన్నారు.