ఛత్తీస్గఢ్లోని చింద్బాహార్ జిల్లా దార్భా గ్రామంలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఈశ్వర్ అనే వ్యక్తి కొన్నేళ్ల కిందట క్రైస్తవంలోకి మారారు. ఇటీవల అతడు మరణించగా, మతం మారిన కారణంతో గ్రామస్థులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. దీంతో ఓ మెడికల్ కాలేజీలోనే 4 రోజులు డెడ్ బాడీ ఉండిపోయింది. ఈశ్వర్ కొడుకు సార్తిక్ హైకోర్టును ఆశ్రయించారు. గ్రామంలో అంత్యక్రియలు చేసేందుకు భద్రత కల్పించాలని కోర్టు ఆదేశాలిచ్చింది.