![రైలు క్రిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి రైలు క్రిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి](https://media.getlokalapp.com/cache/97/3d/973dbc5e41b1d943176a3d5a73fae344.webp)
రైలు క్రిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి
గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రిందపడి మృతి చెందిన సంఘటన ఆదోని ఆర్ఎస్ యార్డు వద్ద శనివారం చోటు చేసుకుంది. రైల్వే ఎస్ఐ గోపాల్ తెలిపిన వివరాల మేరకు రైల్వే ట్రాక్ కిమీ 494/38 లైన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు క్రిందిపడి ఆత్మహత్య చేసుకొని తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 9849157634 నంబరుకు కాల్ చేసి వివరాలు తెలపాలని కోరారు.