ఆదోనిలో జెండా ఎగురవేసేది ఎవరు..?
ఆదోని నియోజకవర్గంలో 1955 నుంచి 2019 వరకు 14సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 8సార్లు కాంగ్రెస్ పార్టీ, 3సార్లు టీడీపీ, రెండు సార్లు వైసీపీ, ప్రజా సోషలిస్టు పార్టీ ఒక్కసారి చొప్పున విజయం సాధించాయి. ఆదోని నియోజకవర్గంలో ఈ సారి జరిగే ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే వై. సాయిప్రసాద్ రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా బీజేపీ తరుపున పార్థసారధి పోటీ చేస్తున్నారు. గెలుపు కోసం ఎవరికి వారు అస్ర్తశస్ర్తాలు ప్రయోగిస్తున్నారు. దీంతో ఆదోనిలో ఈ ఎన్నిక ఉత్కంఠగా మారింది.