పరారీలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి?

54చూసినవారు
పరారీలో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి?
AP: ఈవీఎంను ధ్వంసం చేసిన ఘ‌ట‌న‌లో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీఈవో, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ క్ర‌మంలో పిన్నెల్లి కోసం పోలీసులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌గా.. పిన్నెల్లి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలోని సంగారెడ్డిలో ఆయన ఉన్నట్లు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఆయన తన కారు వదిలి పరారైనట్లు తెలుస్తోంది.