ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు

70చూసినవారు
ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమతో పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వెల్ల‌డించింది. రానున్న నాలుగు రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు పలుచోట్ల 2–3 డిగ్రీలు, అక్కడక్కడ 4–5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఈ నెల 7వ తేదీ నుంచి గాలిలో మార్పుల వల్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

ట్యాగ్స్ :