రూ.2400 కోట్లతో కట్టిన ఎయిర్ పోర్టు.. ఒక్క వానకే లీకైంది

77చూసినవారు
రూ.2400 కోట్లతో కట్టిన ఎయిర్ పోర్టు.. ఒక్క వానకే లీకైంది
లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇటీవలే రూ.2400 కోట్లతో నిర్మించిన టెర్మినల్ టీ-3 తొలి వర్షంలోనే లీకేజీ మొదలైంది. సీటుపై నీరు పడడంతో ప్రయాణికులు వేరే చోటికి వెళ్లాల్సి వచ్చింది. దీనిపై ఎయిర్‌పోర్టు అధికారులకు సమాచారం అందించారు. ఆ తర్వాత లీకేజీని సరిచేశారు. ఈ భవనం కొత్తదని విమానాశ్రయ ప్రతినిధి తెలిపారు. మొదటి వర్షంలో ఏర్పడిన చిన్నపాటి లీకేజీని సరిచేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్