ప్రశాంతంగా ముగిసిన మొహరం వేడుకలు

72చూసినవారు
చాగలమర్రి మండలం ముత్యాలపాడు గ్రామంలో బుధవారం రాత్రి మొహర్రం పండుగ వేడుకలు ఘనంగా ముగిశాయి. తాలూకా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఇరిగెల నారాయణరెడ్డి ఈ వేడుకలలో పాల్గొని పీర్ల స్వాములకు చదివింపులను సమర్పించారు. ఈ సందర్భంగా ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో కుల మతాలకు అతీతంగా మొహర్రం వేడుకలు ప్రశాంతంగా జరగడం శుభసూచకమన్నారు.

సంబంధిత పోస్ట్