అహోబిలంలో ఘనంగా శ్రీరామనవమి పర్వదిన వేడుకలు

50చూసినవారు
ఆళ్లగడ్డ మండలం లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన దిగువ అహోబిలంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో బుధవారం శ్రీరామనవమి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి మూలవిరాట్ విగ్రహాలకు ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.