పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్లో ఈ నెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘యూట్యూబ్, వాట్సాప్’ సహా సోషల్ మీడియాపై నిషేధం విధించింది. పాకిస్థాన్లో 17న ముహర్రం అషురా జరుపుకుంటారు. దీనికి సంబంధించి పంజాబ్ ప్రావిన్స్లో 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు సోషల్ మీడియాపై నిషేధం విధించారు.పాకిస్తాన్ లోని పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది.