కర్ణాటకలో భారీగా పెరుగుతున్న డెంగీ కేసులు

58చూసినవారు
కర్ణాటకలో భారీగా పెరుగుతున్న డెంగీ కేసులు
కర్ణాటకలో డెంగీ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 7,000కు పైగా డెంగీ కేసులను అధికారులు గుర్తించారు. వారిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్ర రాజధాని ఒక్క బెంగళూరులోనే అత్యధికంగా 1,908 డెంగీ కేసులు నమోదయ్యాయని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇతర జిల్లాల వారీగా చూస్తే చిక్కమగళూరులో 521, మైసూర్‌లో 496, హవేరిలో 481 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

సంబంధిత పోస్ట్