నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు కౌన్సెలింగ్ను వాయిదా వేస్తున్నట్లు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఇటీవల నీట్ యూజీ పరీక్షలో పేపర్ లీకేజీలు, గ్రేస్ మార్కుల వ్యవహారంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులు JB పార్దివాలా, మనోజ్ మిశ్రాతో పాటు CJI డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నీట్ వివాదానికి సంబంధించి పలు పిటిషన్లను జూలై 8న విచారించనుంది.