ఏపీలో మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్

54చూసినవారు
ఏపీలో మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్
నూతన మద్యం పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం పాలసీ అమలులోకి రానుంది. తక్కువ ధరకే మద్యం అందించనున్నారు. మద్యం ధర రూ.99 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు కేబినెట్ స్పష్టం చేసింది. తాజాగా మద్యం షాపుల పనివేళల విషయంలోనూ స్పష్టతనిచ్చింది. మద్యం షాపుల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయని మంత్రి పార్థసారథి తెలిపారు.

సంబంధిత పోస్ట్