భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు: వైవీ సుబ్బారెడ్డి

50చూసినవారు
భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారు: వైవీ సుబ్బారెడ్డి
భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని వైసీపీ సీనియర్ నేత, మాజీ టీటీడీ చైర్మన్ వై.వీ.సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమల పవిత్రతను కాపాడామని తెలిపారు. స్వామి వారి నైవేద్యంలో కల్తీ జరుగుతుందని.. లడ్డూలో ఆవు నెయ్యి వాడటం లేదని చంద్రబాబు ఆరోపణలు చేశారు. కూట‌మి వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే చంద్ర‌బాబు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్