
విషాదం.. జర్మనీలో ప్రకాశం జిల్లా విద్యార్థిని మృతి
AP: ఉన్నత చదువుల కోసం జర్మనీకి వెళ్లిన ప్రకాశం జిల్లా విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. గిద్దలూరు మండలం కంచిపల్లె గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ షేక్ మహబూబ్ బాషా కుమార్తె రెహనా బేగం (28) జర్మనీలో మెడికల్ ఇంజినీరింగ్లో మాస్టర్ డిగ్రీ చదువుతుంది. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఈ నెల 21న మృతి చెందింది. ఇవాళ కంచిపల్లెలో ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.