సీఎం జగన్పై టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. "బోగస్ బటన్ నొక్కుతూ ఎంతకాలం మోసగిస్తారు? బటన్ నొక్కి నెల అయినా విద్యా దీవెన ఎందుకు ఇవ్వలేదు? 90 శాతం విద్యార్థులకు ఇంకా ఫీజులు ఎందుకు అందలేదు? రెండున్నర నెలలుగా డ్వాక్రా మహిళల డబ్బులు ఏంచేశారు? కోడ్కు ముందు బటన్ నొక్కిన పెట్టుబడి రాయితీ డబ్బులేవి?" అని సీఎంను ప్రత్తిపాటి ప్రశ్నించారు.