ఇటీవలే వైసీపీకి వీడ్కోలు పలికిన గుంటూరు జిల్లా నేత తాడిశెట్టి మురళీమోహన్ టీడీపీ గూటికి చేరారు. ఉండవల్లి వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆయనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. "వైసీపీ ఏపీని ఖాళీ చేసే పరిస్థితి వచ్చింది. రెడ్ డైరీ అంటే వైసీపీలో వణుకు మొదలైంది." అని అన్నారు.