తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో కిలో స్కిన్లెస్ చికెన్ రూ.290 నుంచి రూ.310లు పలుకుతోంది. స్కిన్తో అయితే రూ.280 నుంచి రూ.300 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.520కు అమ్ముతుండటం గమనార్హం. ఇవే ధరలు ఏపీలో కూడా కొనగసాగుతున్నాయి. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, అలాగే ఈ వారంలో వర్షాలు పడటం వలన ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.