రతనాల సీమ రాయలసీమ మట్టిలో వజ్రాలు దొరుకుతుంటాయి. సాధారణంగా వర్షం పడితే మంచి మట్టి వాసన రావడం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నాలుగు చినుకులు పడితే చాలు మట్టి నుంచి వజ్రాలు బయటపడతాయి. ఇప్పుడు వర్షాలు మొదలు కావడంతో మే నెల మధ్యలోనే కర్నూలు జిల్లా తుగ్గిలి, జొన్నగిరి, అనంతపురం జిల్లా వజ్రకరూరులో వజ్రాల కోసం వేట మొదలైంది. అక్కడి పొలాలన్నీ వజ్రాలు వెతికే వారితో నిండిపోయాయి.