సీఎం జగన్పై దాడి కేసుకు సంబంధించి పోలీసులు కీలక అప్డేట్ ఇచ్చారు. సతీష్ను ఏ1గా, దుర్గారావును ఏ2గా పోలీసులు నిర్ధారించి వారిపై కేసు నమోదు చేశారు. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరంలో వివేకా స్కూల్ పక్కన రోడ్డుపై నుంచి దాడి చేసినట్లు తెలుస్తోంది. దుర్గారావు చెబితేనే సతీష్ దాడి చేశాడు. సెంట్రల్ నియోజకవర్గం టీడీపీలో దుర్గారావు యాక్టివ్గా ఉన్నారు. ఇవాళ వీరిద్దరిని పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.