ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లా లక్సర్ తాలూకాలోని ఇస్మాయిల్పూర్ గ్రామంలో కూలీలు పనులు చేస్తుండగా పంటపొలాల్లో భారీ కొండ చిలువ కనిపించింది. దాంతో వాళ్లు భయంతో పరుగులు తీశారు. అనంతరం గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఘటనా ప్రాంతానికి చేరుకున్న అధికారులు రెండు గంటలపాటు తీవ్రంగా శ్రమించి ఆ కొండ చిలువను పట్టుకున్నారు. దాని పొడవు 13 అడుగులు ఉండగా.. బరువు ఏకంగా 125 కిలోలు ఉంది.