రాజస్థాన్లోని జయపురకు చెందిన మాజీ కమాండో హిమ్మత్సింగ్ రాథోడ్ (40) ఇరవై నాలుగు గంటల్లో 70,679 మెట్లు ఎక్కి ప్రపంచ రికార్డును బద్దలుకొట్టారు. స్పెయిన్కు చెందిన క్రిస్టియన్ రాబర్టో (70,200 మెట్లు) పేరిట ఉన్న రికార్డును ఈయన అధిగమించారు. స్థానిక వైశాలి నగర్లో మొత్తం 439 మెట్లున్న 20 అంతస్తుల భవనాన్ని హిమ్మత్సింగ్ 81 సార్లు ఎక్కి 80 సార్లు దిగారు.