తన మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. "అవినాశ్ రెడ్డిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడటానికి సిగ్గు లేదా? హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు ఇచ్చింది. తెలంగాణ నుంచి వచ్చానని అంటున్నారు. అక్కడ కేసీఆర్ను ఓడించాం.. మా పని అయిపోయింది. ఏపీలో నా పని ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాను." అని షర్మిల వ్యాఖ్యానించారు.