దాడి ఘటనపై తొలిసారి స్పందించిన సీఎం

72059చూసినవారు
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన సీఎం
తనపై జరిగిన రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారిగా స్పందించారు. సోమవారం తనను పరామర్శించేందుకు వచ్చిన పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ దాడిపై మాట్లాడినట్లు తెలుస్తోంది. మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వస్తున్న ఆదరణను చూసి తనపై దాడులు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని జగన్ తెలిపినట్లు సమాచారం. మరోసారి వైసీపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం జగన్ చెప్పినట్లు పార్టీ నేతలు తెలిపారు.