పంజాబ్కు చెందిన ప్రముఖ కవి, రచయిత సుర్జిత్ పటార్ (79) చనిపోయారు. గుండెపోటుతో శనివారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో పంజాబ్ సాహిత్య సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. సుర్జిత్ పటార్ సాహిత్యానికి చేసిన కృషికి పంజాబ్ సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ, పంజాబ్ రట్టన్తో సహా అనేక అవార్డులు ఆయనకు దక్కాయి. ఆయన మృతి పట్ల వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు, కవులు, రచయితలు, అభిమానులు సంతాపం తెలిపారు.