వివాహమైన కొన్ని గంటల్లోనే నవ వధువు మృతి
పార్వతీపురం నియోజకవర్గంలోని మక్కువ మండలం దబ్బగడ్డలో విషాదం చోటుచేసుకుంది. వివాహమైన కొన్ని గంటల్లోనే వధువు అఖిల (20) మృతిచెందింది. గత రాత్రి 10 గంటలకు వివాహమయ్యాక వధువు అఖిల నిద్రలోకి జారుకుంది. నిద్రలోనే అపస్మారక స్థితికి చేరుకోవడంతో బంధువులు మక్కువ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో సాలూరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే నవ వధువు మృతిచెందింది.