చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా ధరించిన తేజోవతి
ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా సాలూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఆర్పీ భంజ్దేవ్ తో మక్కువ మండల టీడీపీ నాయకులు పెంట తిరుపతిరావు విజయవాడ వెళ్లి చంద్రబాబును గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారితోపాటు సాలూరు నియోజకవర్గం నుండి టీడీపీ టికెట్ ఆశిస్తున్న తేజోవతికి మరోమారు చంద్రబాబు పార్టీ కండువా వేసి వేధిక పైకి ఆహ్వానించారని పెంట తిరుపతిరావు ఈ సందర్భంగా తెలిపారు.