మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ కేసును సీఎ జగన్ ఎటైనా మరల్చవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క జీవోతో సీబీఐని రానివ్వకుండా అడ్డుకోవచ్చని, కానీ వైఎస్ సునీత నిర్ణయాన్ని సీఎం జగన్ స్వాగతించారని తెలిపారు. సీబీఐ విచారణను సీఎం జగన్ వ్యతిరేకించలేదన్నారు. వివేకాను హత్య చేసింది ఎవరో ప్రజలు తెలుసని సజ్జల తెలిపారు.