ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి గట్టి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. వైశ్య సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు ఆ పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. దర్శి అసెంబ్లీ టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురైంది. తీవ్ర అసంతృప్తికి గురైన శిద్ధా.. ఈ నెల 27న టీడీపీలో చేరనున్నట్లు సమాచారం. కాగా, దర్శి వైసీపీ టికెట్ను బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కింది.