ఛత్తీస్గఢ్లో హోలీ పండుగ రోజున మావోయిస్టులు రెచ్చిపోయారు. ఇన్ఫార్మర్ల నెపంతో ముగ్గురిని కిరాతకంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ బాసగూడ ప్రాంతంలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బాసగూడ ప్రాంతంలోని ఓ కాలనీలోకి చొరబడి దాడులకు పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.