టిడిపి నుంచి వైసీపీలోకి చేరికలు
మాకవరపాలెం మండలం కొండల అగ్రహారం గ్రామానికి చెందిన పలు టీడీపీ కుటుంబాలు గురువారం వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేశ్ వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ 30 వేల మెజార్టీ సాధిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకుడు యర్రాపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.