టిడిపి నుంచి వైసీపీలోకి చేరిన సర్పంచ్

53చూసినవారు
మాకవరపాలెం మండలం బూరుగుపాలెం సర్పంచ్ ఓబ్బలరెడ్డి వెంకటరమణ బుధవారం టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన అనుచరులు, పలువురు వార్డు మెంబర్లు కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. అనంతరం గణేష్ మాట్లాడుతూ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్