విద్యుత్ షాక్ తో రెండు మేకలు మృతి
విద్యుత్ షాక్ కు గురై రెండు మేకలు మృతి చెందిన ఘటన ముంచంగిపుట్టు మండలంలోని పెదగూడ పంచాయతీ పరిధి జరిపడలో చోటుచేసుకుంది. వివరాలు జరిపడకులోని రాంబాబుకి చెందిన రెండు మేకలు గ్రామ సమీపంలోని మేత మేస్తుండగా శనివారం కురిసిన అకాల వర్షంతో ఇనుప స్థంబంలో విద్యుత్ సరఫరా అయి ఉండడంతో మేకలకు షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాయి. ప్రభుత్వం గుర్తించి తనను పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాధిత రైతు రాంబాబు కోరారు.