శివరాత్రి ఉత్సవాలకు శ్రీశైలం ఆహ్వానం

71చూసినవారు
శివరాత్రి సందర్భంగా శ్రీశైలం దేవస్థానం చేపట్టే బ్రహ్మోత్సవాలకు విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర స్వాములను ఆహ్వానించారు. ఈ మేరకు శ్రీశైలం పండితులు, అధికారులు మంగళవారం పీఠాన్ని సందర్శించారు. బ్రహ్మోత్సవాలలో పాల్గొని శివ భక్తులకు అనుగ్రహ భాషణం అందించాలని కోరారు. శ్రీశైలం దేవస్థానం ఘనాపాటి గంటి రాధాకృష్ణ తదితర పండితులు పీఠాధిపతులను కలిసిన వారిలో ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్