వైభవంగా పెద్దింటమ్మ అమ్మవారి పరస
విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని మల్కాపురం గ్రామంలో కొలువుదీరిన పెద్దింటమ్మవారి పరసను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఉగాది రోజున పెద్దింటమ్మ పరస మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పరసను కన్నుల పండువగా నిర్వహించారు. అమ్మవారికి మహిళలు పుసుపుకుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.