ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల తర్వాత ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీ ఎన్నికల ముందు పార్టీలు మారిన నేతలపై చర్యలకు దిగుతున్నట్టు తాజా పరిణామాలతో అర్ధం అవుతుంది. తాజాగా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కి బిగ్ షాక్ తగిలిన విషయం తెలిసిందే. తనపై అనర్హత వేటు వేయడం కేవలం వైసీపీ కక్షపూరిత చర్య అని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. బీసీలను అణగదొక్కే ప్రయత్నం వైసిపి చేస్తుందని, వైసీపీలో ఎవరినైనా వాడుకుని వదిలేస్తారని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు.