వైసీపీ పతనం ఖాయం: నారా లోకేష్

81చూసినవారు
వైసీపీ పతనం ఖాయం: నారా లోకేష్
వైసీపీ నేతలకు ఓటమి భయం నరరూప రాక్షసులుగా మార్చేసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. టీడీపీకి ఓటు వేశారనే అనుమానంతో పెళ్లకూరులో గర్భిణీపై దాడి చేశారని మండిపడ్డారు. నచ్చినట్లు ఓటు వేటు వేసే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిన వైసీపీ పతనం ఖాయమన్నారు. గర్భిణీకి మెరుగైన వైద్యం అందించి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.