ఇంగ్లాండ్లోని 'ఆక్స్ ఫర్డ్' లో 11 మంది సంతానంలో పదోవాడిగా 1803 మే 15న ఆర్థర్ థామస్ కాటన్ జన్మించారు. ఈయన ఈస్టిండియా కంపెనీలో మిలిటరీ ఇంజినీర్గా ఎదిగి, 1821లో భారత్కు వచ్చారు. మద్రాసు రాష్ట్ర చీఫ్ ఇంజినీర్ వద్ద అసిస్టెంట్ ఇంజినీర్గా చేరారు. చోళ రాజులు చేపట్టిన పనుల స్ఫూర్తితో కావేరీ నదిపై పలు ఆనకట్టలు కట్టి.. కరవు కాటకాలతో అల్లాడుతున్న తంజావూరు జిల్లాను అన్నపూర్ణగా మార్చేశారాయన.