టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్ ఎంపీ..?

4934చూసినవారు
టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్ ఎంపీ..?
సీఎం జగన్‌కు బిగ్‌షాక్ తగలనుంది. నరసరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఈ నెల 22న టీడీపీలోకి చేరనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన లావు కృష్ణదేవరాయలు.. ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో రెండు సార్లు భేటీ అయ్యారు. ఈ మేరకు చంద్రబాబు కూడా ఆయనను పార్టీలోకి స్వాగతించారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి టీడీపీ టికెట్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.