తొమ్మిది వద్ద ఆగిన వైసీపీ..!

80చూసినవారు
తొమ్మిది వద్ద ఆగిన వైసీపీ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కి ఇటీవల కాలంలో రాజ్యసభ సభ్యుల రాజీనామాలు తలనొప్పులు కలిగిస్తున్నాయి. సైలెంట్‌గా ఇద్దరు ఎంపీలు రాజీనామాలు చేశారు.ఈ నేపథ్యంలో మరింత మంది ఎంపీలు జంప్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఎవరైతే పార్టీకి దూరం అవుతార‌ని ప్రచారం విస్తృతంగా సాగుతోందో వారే మీడియా ముందుకు వచ్చి తాము వైసీపీతోనే ఉంటామని స్పష్టం చేయడంతో జగన్ ఊపిరి పీల్చుకునేందుకు అవకాశం ఏర్పడింది. దీంతో వైసీపీకి పెను తుఫాను తప్పిందని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్