వైసీపీ నేత వాహనానికి నిప్పు

82చూసినవారు
వైసీపీ నేత వాహనానికి నిప్పు
AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వైసీపీ నేత, 23వ వార్డు కౌన్సిలర్ అర్చన వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. అర్థరాత్రి ఎవరు లేని సమయంలో కారును తగలబెట్టారు. టీడీపీ నేత మహేష్, అతని అనుచరులపై అర్చన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కారును తగలబెట్టారని అర్చన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.