ఒక్క రోజులో 109 డెంగీ కేసులు

63చూసినవారు
ఒక్క రోజులో 109 డెంగీ కేసులు
కేరళలో డెంగీ విజృంభిస్తోంది. ఒక్క రోజులోనే 109 మందికి డెంగీ సోకినట్లు అక్కడి వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. డైరెక్టర్ ఆఫ్‌ హెల్త్‌ సర్వీస్‌(DHS) విడుదల చేసిన వివరాల ప్రకారం.. శుక్రవారం 11,500 మందికి పరీక్షలు నిర్వహించగా.. 109 మందికి డెంగీ నిర్ధరణ అయ్యింది. ముఖ్యంగా మలప్పురం జిల్లాలోనే ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. జులై 1 నుంచి ఐదు రోజుల వ్యవధిలో దాదాపు 50 వేల మంది జ్వరం బారిన పడినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

సంబంధిత పోస్ట్